Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయతీలోని అమరారంలో గిరిజన యువతిపై పాశవికం గా లైంగికదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా చందు నాయక్, ప్రధాన కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జానంపేట పంచాయతీలోని పాండురంగాపురం గ్రామానికిచెందిన గిరి జన యువతి ఈనెల 11న అమరారంలో జాతరకు వెళ్లిందని తెలిపారు. అమరారం గ్రామానికి చెందిన పొలేబోయిన భరత్, ఏసుబాబుతోపాటు మరో 9 మంది యువ కులు యువతిని ఆటోలో బలవంతంగా లాక్కొని తీసుకెళ్లారని పేర్కొన్నారు. అమరారం అడవుల్లో గిరిజన యువతిపై పైశాచికానికి పాల్పడారని తెలిపారు. తెల్లారి భూపాలపల్లి జిల్లా అఖినపల్లి మల్లారం అడవుల్లో మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలు, మహిళలపై ఎంతటి నేరాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదని తెలిపారు. గిరిజన యువతిపై దారుణానికి పాల్పడిన వారిని నిర్భయ చట్టం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం, అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.