Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రవేశాల ప్రక్రియపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలిలో సమావేశం జరగనుంది. ఈ సమా వేశంలో ఉన్నత మండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు ఆర్ లింబాద్రి, వి వెంకట రమణ, విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్తోపాటు విశ్వవిద్యాలయాల వీసీలు హాజరుకానున్నారు. 2016-17 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ ప్రవే శాల నోటిఫికేషన్ విడుదల తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. డిగ్రీ ఆన్లైన్ ప్రవే శాల వల్ల విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు రాకుండా ఏం చేయాలన్న దానిపైనా ఆలో చించి నిర్ణయం తీసుకోనున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో వచ్చే ఇబ్బం దులను ముందుగానే పరిష్కరించుకునే అంశంపైనా చర్చించనున్నారు. ఇంకోవైపు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు దరఖాస్తు విధానంలోనూ మార్పులు చేసే అవకాశముంది. విద్యార్థు లు సులభతరంగా దరఖాస్తు చేసేకునే వెసులుబాటు కల్పించనున్నారు. ప్రయివేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నట్టుగా మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేప ట్టాలా? లేదా అన్న అంశంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంకోవైపు డిగ్రీ కోర్సుల ఫీజులు దోస్త్ వెబ్సైట్లో ఒకటి, ఈపాస్ వెబ్సైట్లో మరొకటి ఉన్న విషయం తెలిసిందే. డిగ్రీ ఫీజులు దోస్త్, ఈపాస్ వెబ్సైట్లో ఒకేలా ఉండే అంశమూ చర్చకు రానుంది.