Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థల పరిశీలన కోసం ప్రత్యేకాధికారి నియామకం
- ఎట్టకేలకు కదిలిన పాఠశాల విద్యాశాఖ
- 13 మందికి చెందిన ఫైల్ మాయం!
- అధికారులపై చర్యలకు రంగం సిద్ధం!
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
హౌస్బిల్డింగ్ అడ్వాన్స్ల వ్యవహారంపై ఎట్టకేలకు పాఠశాల విద్యాశాఖ అధికారుల్లో కదలిక మొదలైంది. అడ్వా న్సులు పొందిన ఉద్యోగులందరికీ నోటీసులు జారీ చేయా లనీ ఆ శాఖ కమిషనర్ జి కిషన్...హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి వెంకటనర్సమ్మను ఆదేశించారు. ఈ వ్యవ హారంతో సంబంధమున్న కొందరు ఉద్యోగులపై త్వరలో వేటు వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికితోడు అక్రమంగా అడ్వాన్స్లు పొందిన వారి నుంచి మొత్తం డబ్బుంతా ఒకేసారి సర్కారుకు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నది. అయితే మొదటి విడతలో రుణాలు పొందిన 13 మందికి చెందిన ఫైల్ మాయం అయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం హౌస్బిల్డింగ్ అడ్వాన్స్ల వ్యవహారం విద్యా శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 73మంది ఉద్యోగులు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్లు పొందినా, నేటికీ ఏ ఒక్కరూ ఇల్లు కట్టలేదు సరికదా..కనీసం పునాదులు కూడా తీయ లేదు. ఈ వ్యవహారాన్ని నవతెలంగాణ 'ఇంటిగుట్టు' శీర్షికతో వారం రోజుల క్రితం వెలుగులోకి తీసు కొచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం హైద రాబాద్ ఆర్జేడీ విజయలక్ష్మిబాయిని విచార ణాధికారిగా నియమించారు. ఇప్పటికే హైదరాబాద్ డీఈఓ వెంకటనర్సమ్మ ప్రాథమిక నివేదిక పాఠశాల విద్యాశాఖ అధికారులకు అందించారు. దీనిలో ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాకుండానే అక్రమంగా నిధులు పొందినట్టు గుర్తించారు. దీనిపై స్పష్టత కోసం విద్యాశాఖ డిప్యూటీఈఈ ప్రదీప్ను నియమించారు. ఆయన ఉద్యో గులు ప్రభుత్వానికి చూపించిన స్థలాన్ని పరిశీలించి, నిర్మా ణాలు ఉన్నాయా..? లేదా అనే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ సోమిరెడ్డి హాయాంలో 13మంది ఉద్యోగులు మూడు విడతల హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్లు పొందారు. డీఈఓ రమేశ్ హయాంలో అడ్వాన్స్లు పొందిన 60మంది ఉద్యోగుల్లో ఆరుగురు మూడు విడతలు, మిగిలిన వారంతా రెండు విడతల అడ్వాన్స్లు అందినట్టు సమాచారం. హౌస్బిల్డింగ్ అడ్వాన్స్లు పొందాలంటే కనీసం 8 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. కానీ ప్రస్తుతం లోన్లు తీసుకున్న వారిలో కొందిమందికి అంత సర్వీస్ కూడా లేదని తెలుస్తోంది. హౌస్బిల్డింగ్ అడ్వాన్స్ల సెక్షన్తో సంబంధం లేని ఓ సీనియర్ అసిస్టెంట్ దీన్ని నిర్వహించడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అడ్వాన్స్ల వ్యవహారంలో డీఈఓ ఆఫీస్లోని నలుగురు కిందిస్థాయి అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అడ్వాన్స్లు పొందిన ఉద్యోగులంతా ఉద్యోగ సంఘం నేతలతో కలిసి..విద్యాశాఖ కమిషనర్ను మూడురోజుల క్రితం కలిశారు. ఇండ్ల నిర్మాణానికి మరో ఏడాది సమయం ఇవ్వాలని కోరగా, ఆయన ససేమిరా అన్నట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారం నుంచి బయట పడేస్తామంటూ కొందరు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే స్థలం కొనుగోలుకు మొదటి విడత, నిర్మాణం ప్రారంభం అయ్యాకే రెండో విడత, రూఫ్ లెవల్ పూర్తయ్యాక మూడో విడత అడ్వాన్స్ తీసుకోవాలని నిబంధనలున్నాయి. కానీ అదేదీ లేకుండా నిధులు మంజూరు చేయడం వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్స్లు పొందిన ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా, ఉద్యోగం సంఘం నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ జరిపి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ జి కిషన్ 'నవతెలంగాణ'తో చెప్పారు.
ఉన్నతాధికారులకు టీఆర్ఎస్ నేత ఫిర్యాదు
హౌసింగ్ అడ్వాన్స్ల వ్యవహారంపై టీఆర్ఎస్ నాయకుడు సయీద్ సిరాజుద్దీన్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సర్కారును మోసం చేసి అక్రమంగా అడ్వాన్స్లు పొందిన ఉద్యోగులపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాశాఖతో పాటు ఈఎస్ఐ, జూపార్క్, కోఠి హాస్పిటల్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఉద్యోగులూ సుమారు 350 వరకు ఇదే తరహాలో అడ్వాన్స్లు పొందారని వారిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులకు, విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదు చేశారు.