Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య అతిథిగా గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మేవాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'సామాజిక న్యాయం- రాష్ట్ర సమగ్రాభివృద్ధి' అనే నినాదంతో సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగిసి సోమవారం నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు, గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మేవాని హాజరు కానున్నారు. సభలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, టీ మాస్ ఫోరం చైర్మెన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రజా గాయకుడు గద్దర్, బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్, నాయకులు మజీబుల్లాఖాన్ తదితరులు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సీపీఐ (ఎం) ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చింది.
నేడు బీఎల్ఎఫ్ కార్యాయలం ప్రారంభం
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్రోడ్స్లోని సీపీఐ (ఎం) నగర కార్యాలయం వద్ద గల ఈ ఆఫీసును గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మేవాని ప్రారంభిస్తారు. సాయత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాల నేతలందరూ పాల్గొంటారని ఫ్రంట్ నేతలు తెలిపారు.