Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ బీభత్సం..
- ఇద్దరు మృతి
నవతెలంగాణ- పటాన్చెరు
ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న మరో లారీ బలంగా ఢకొీట్టుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభాన్ని తాకింది. చివరకు, రెండు లారీలు ఢకొీన్నాయి. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సిమెంట్ లోడ్ లారీ.. ఇటుకల లారీని ఢకొీన్నాక కరెంట్ స్తంభాన్ని ఢకొీంది. తర్వాత అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ గోడను గుద్దుకుని ఆగిపోవడంతో పెను ముప్పు తప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బీడీఎల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్కు చెందిన లారీ ఇంద్రేశం శివారులో బట్టీ వద్ద ఇటుకలు లోడ్ చేసుకుని అత్తాపూర్ వైపునకు వెళ్తోంది. కర్దనూర్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాగానే, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వైపు నుంచి పటాన్చెరు వైపు వస్తున్న సిమెంట్ లారీ ఇటుకల లారీని వేగంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో మహబూబ్నగర్ జిల్లా దామరగిద్ద మండలం ఒత్తుగూడ తండాకు చెందిన ఇటుకల లారీ డ్రైవర్ ప్రవీణ్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. దానిపై ఉన్న కూలీలు సంజీవ్(23), మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా సంజీవ్ మృతిచెందాడు. గాయపడిన వారిని సంగారెడ్డి నుంచి లాలక్నగర్లోని ప్రీమియర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉంది. సిమెంట్ లోడ్ లారీ ఇటుకల లారీని ఢకొీన్న అనంతరం విద్యుత్ స్తంభాన్ని, ఆపై పెట్రోల్ బంక్ గోడను ఢకొీని ఆగింది. విద్యుత్ స్తంభాన్ని ఢకొీన్న వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెట్రోల్ బంక్ సమీపంలో తీగలు పడ్డాయి. లారీ బంక్ గోడను గుద్దుకుని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వేణుగోపాల్రెడ్డి తెలిపారు.