Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ను ఓడించాలి : బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్
నవతెలంగాణ - చౌటుప్పల్
రాష్ట్ర బడ్జెట్లో సామాన్య ప్రజలకు మొండి చెయ్యి చూపారని బహుజన లెఫ్ట్ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తెలంగాణ లేబర్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముత్యాల శ్రీరాములుతో కలిసి ఆయన ప్రారంభించారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్, మహాత్మాగాంధీ, సావిత్రిబాయిఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడేందుకు 28 పార్టీలతో బహుజన లెఫ్ట్ఫ్రంట్ ఆవిర్భవించిందన్నారు.
ఫ్రంట్లో తెలంగాణ లేబర్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులకు మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. వెనుకబడిన తరగతులపై సీఎం కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందో బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందన్నారు. 93శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందన్నారు. 2019లో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీఎల్ఎఫ్ పోటీ చేస్తుందన్నారు. లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేశ్ మాట్లాడుతూ.. పేదలకు రాజ్యాధికారం ఏకైక లక్ష్యంగా తెలంగాణ లేబర్పార్టీ పని చేస్తుందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆర్.మూర్తి, ఎమ్డి.యాకుబ్ అలీ, సుధాకర్, స్వామి, రమేశ్, బోయ దేవేందర్, చెంచల శ్రీను, ఊదరి శ్రీనివాస్, బోసుబాబు, బర్రె సుధాకర్, చరణ్ పాల్గొన్నారు.