Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులో మునిగి ఐదుగురు మృతిొమెదక్ జిల్లా కన్నారంలో ఘటనొపరిశీలించిన తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కౌడిపల్లి
వివాహ వేడుకకు వచ్చిన బంధువులు ఊరి పక్కనే ఉన్న చెరువులో సరదా కోసం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రాణం కోల్పోయారు. ఐదుగురు చెరువులో మునిగి మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నారం గ్రామానికి చెందిన ఖాజా ఇంతియాజ్(40) కొన్ని సంవత్సరాల కిందట హైదరాబాద్లోని యాకత్పూరలో స్థిరపడ్డాడు. స్వగ్రామంలోని దస్తగిరి ఇంట్లో ఈనెల 20న వివాహం ఉంది. అందు కోసం యాకత్పూర, మెదక్ నుంచి బంధువులు కన్నారం వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం పక్కనే ఉన్న చెరువులో సరదాగా చేపలు పట్టేందుకు ఇంతియాజ్తోపాటు ఇసాక్ అలీ(11), మహ్మద్ అలీ(8), మహ్మద్ అఫీజ్(35), హుదా కరీమా(16) సుభాన్, సయ్యద్ జుబెదుల్లా, మరియాఫాతిమా వెళ్లారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువులో పూడిక తీయడంతో పెద్ద గుంత ఏర్పడింది. ఆ విషయం వారికి తెలియక అందరూ వరుసగా దిగారు. ఐదుగురు నీటిలో మునిగిపోయారు. దీన్ని గమనించిన సుభాన్ అరుస్తూ సయ్యద్ జుబెదుల్లా, మరియాఫాతిమాను నీటిలోకి దిగకుండా అడ్డుకున్నాడు. విషయాన్ని వెంటనే గ్రామస్తులకు తెలిపాడు. స్థానికులు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఐదుగురూ చనిపోయారు. తూప్రాన్ డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. డీఎస్పీ వెంట తూప్రాన్ సీఐ లింగేశ్వర్రావు, నర్సాపూర్ ఎస్ఐ వెంకటరాజాగౌడ్, చిలప్చెడ్ ఎస్ఐ మల్లయ్య, కౌడిపల్లి ఏఎస్ఐలు వెంకటేశం, కలీమోద్దిన్, డీసీసీబీ జిల్లా వైస్చైర్మెన్ గోవర్దన్రెడ్డి, సర్పంచ్ దివ్యమహిపాల్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.