Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం హామీలు ఇవ్వాలి... ఎటువంటి వాగ్ధానాలను మేనిఫెస్టోలో పెట్టాలనే అంశాలపై చర్చించేందుకు టీపీసీసీ సమావేశమైంది. శుక్రవారం గాంధీభవన్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి అధ్యక్షతన అధ్యయన కమిటీ భేటీ అయింది. పెన్షన్లు, హౌసింగ్ తదితర అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలపై హామీలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందాయన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నామన్నారు. ప్రజలకు గహ నిర్మాణ పథకం, పెన్షన్లు, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాలలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందిస్తామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కషి చేశామన్నారు. అలాగే వికలాంగులు, వితంతువులు, వద్దులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఆరోగ్య శ్రీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళలకు పావలావడ్డీ రుణాలు, సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ చేశామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు హర్కర వేణుగోపాల్, జి నిరంజన్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఈరవర్తి అనిల్, మహేశ్వర్రెడ్డి, నేత నాయిని రాజేందర్ రెడ్డి, ఫక్రూద్దిన్, రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అజ్మీర్కు చాదర్ పంపిన కాంగ్రెస్
పవిత్ర అజ్మీర్ షరీఫ్ దర్గాకు టీపీసీసీ చాదర్ను పంపింది. శుక్రవారం గాంధీభవన్లో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి చాదర్ పంపించారు. పార్టీ నాయకులు సిరాజ్, మైనార్టీ సెల్ చైర్మెన్ ఫక్రూద్దీన్, మహ్మద్ మీరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.