Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విహారయాత్రల్లో ప్రపంచ సగటును దాటేసిన భారతీయులు
- దేశీయ పర్యటన కన్నా, విదేశీ యాత్రాలకే ప్రాధాన్యమిస్తున్న ఇండియన్స్
- సౌకర్యాలలేమి, అభివ ద్ధి, వసతి వగైరాలే కారణం!
- దేశీయ పర్యాటకంపై పాలకులు ద ష్టి పెడితే, మరిన్ని ఉద్యోగాలు రావొచ్చు: విశ్లేషకులు
- నయా పర్యాటక ఆకర్షణలకు ఆమడ దూరంలో మన భాగ్యనగరం
* జై
ఆధునిక యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతత కోసం ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మౌలిక సదుపాయాల రూపకల్పనలో వస్తోన్న మార్పులు, అత్యాధునిక రవాణా సౌకర్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు.
2.59 కోట్ల ఉద్యోగాలను తెచ్చినప్పటికీ.. :
ప్రకృతి రమణీయ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, అపురూప శిల్ప సౌందర్యం, ఆధునిక సాంకేతిక నిర్మాణాలు, పుణ్య క్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలు, తీర ప్రాంతాలు, వివిధ ప్రాంతాల ప్రజల జీవనవిధానాల్లో వైవిద్యం, మనిషిలో రోజురోజుకూ పెరుగుతోన్న జిజ్ఞాస వెరసి పర్యాటకానికి కొత్త ఊపిరి పోస్తున్నాయనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ ( ప్రయాణం), టూరిజం( పర్యాటకం ) సెక్టార్లు అత్యంత ప్రాధాన్యత గల పరిశ్రమగా రూపొందుతున్నట్టు.. పర్యాటకరంగ ప్రదేశాల అభివృద్ధి, మెరుగుపడుతోన్న రవాణా సాధనాలు, వసతి, మార్కెటింగ్, టెక్నాలజీ వగైరాలు దీనికి ప్రధాన కారణమని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డెబ్బై ఏండ్ల క్రితం రెండున్నర కోట్ల మంది పర్యాటకులు ఉండగా.. నేడు ఆ సంఖ్య 123 కోట్లకు పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల్లో ఏడు శాతం, జీడీపీలో 10 శాతం వాటా పర్యాటక రంగందేనని ప్రపంచ పర్యాటక సంస్థ నివేదిక స్పష్టం చేసింది. కాగా, అత్యంత త్వరితగతిన పురోగతి సాధిస్తోన్న ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2017లో భారతదేశంలో సుమారు 2.59 కోట్ల ఉద్యోగాలు స ష్టించిందని, అదేవిధంగా జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించిందని ఇండియన్ ఇండిస్టీ బాడీ ఫిక్కీ, సర్వీసు సంస్థ కేపీఎంజీ రిపోర్టులు తాజాగా వెల్లడించాయి. ఐతే, దేశీయ పర్యాటకంపై పాలకులు మరింత దృష్టి పెడితే, మరిన్ని ఉద్యోగాలు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మన పర్యాటకం ఇలా
టూర్ అండ్ ట్రావెల్ రంగంలో ప్రపంచదేశాల ప్రయాణికుల సరాసరి ట్రిప్స్ సంవత్సరానికి 4.2గా ఉంటే, భారతదేశంలో అది 5.6గా ఉన్నదని.. దీన్ని బట్టి భారతీయులు విహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని 'గ్లోబల్ ట్రావెల్ ఇంటెన్షన్' పేరుతో వీసా గ్లోబల్ ప్రతినిధులు చేసిన సర్వే పేర్కొంది.
ఐతే, దేశంలో ఉన్న కట్టడాలు, ప్రాంతాలను సందర్శించడం మానేసీ, విదేశీ అందాల వీక్షణకు భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు ఈసందర్భంగా తేలడం విచారాన్ని కలిగిస్తోంది. మనదేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు, సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఇతర దేశాల్లో లేవని చెప్పొచ్చు. ఐతే, అధికారుల అలసత్వం, ముందు చూపు కొరవడటంతో విదేశీ యాత్రికులను ఆకర్షించడంలో విఫలమై, స్వదేశీయులను సైతం ఆకట్టుకోలేకపోతున్నాం. కాగా, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్, చైనా, ఇటలీ, యుకె, జర్మనీ, మెక్సికో, థాయిలాండ్, టర్కీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు పర్యాటకంలో మనకన్నా ఎంతో వేగంగా దూసుకుపోతుండటం గమనార్హం.
మన హైదరాబాద్ కూడా!
భాగ్యనగరాన్ని సందర్శించే స్వదేశీ పర్యాటకుల సంఖ్య రాను రానూ తగ్గుతున్నట్టు గణాంకాలను చూస్తే తెలుస్తోంది. 2016 సంవత్సరంలో హైదరాబాద్ అందాలను సుమారు 1.77 కోట్ల మంది వీక్షించగా, 2017కి ఈ సంఖ్య 1.09కోట్లకు పడిపోయినట్టు అంచనా. చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ వంటి మహా నిర్మాణాలు, ఎప్పుడో నిర్మించిన పార్కులు, ప్రదర్శన శాలలు తప్పా, మరే కొత్త ఆకర్షణ విశ్వనగరం సిగలో చేరకపోవడమే దీనికి ప్రధాన కారణంగా పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఎత్తయిన జెయింట్ వీల్, సాగరం చుట్టూ మోనో రైలు, పెద్ద పెద్ద అక్వేరియాలు, గాజుతో ఏర్పాటు చేసే భూగర్భ సాగరాలు, గోల్ఫ్ క్రీడా మైదా నాలు... ఇలా పాలకులు ఎంతో ఆర్భాటంగా ప్రకటించి న ఆయా నిర్మాణాలు కలగానే మిగిలాయి. ఇప్పటికైనా, పాలకులు వారి మాటలను నిలబెట్టుకుంటారని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
అంకెల్లో పర్యాటకం
14.8శాతం - 2021నాటికి పెరుగనున్న ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ (అంచనా)
156 - వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ లో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య
50 శాతం - యూరప్ ఖండంలోని దేశాలను పర్యటించే ప్రపంచ యాత్రికుల సంఖ్య