Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదరికం, నిరుద్యోగం, అహంలే నేరాలు పెరగడానికి కారణాలు: జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర జైళ్లశాఖ అధ్వర్యాన ఈ ఏడాదిలోనే వంద పెట్రోల్ బంకులను తెరవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, నేరాలను తగ్గించడానికి తాము జరుపుతున్న కృషి ఫలితాలను ఇస్తున్నదని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. శుక్రవారం తమ కార్యాలయంఓ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు సమాజంలో పేదరికం, నిరుద్యోగం, అహంకార పూరిత స్వబావాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేరాలను తగ్గించడానికి గత మూడేండ్లలో తమ జైళ్ల నుంచి విడుదలైన మాజీ ఖైదీలతో కూడిన తన సైన్యంతో కలిసి వివిధ కార్యకలాపాల ద్వారా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే జైళ్ల శాఖ గత మూడేండ్ల కాలంలో చేపట్టిన వివిధ సంస్కరణల వల్ల దేశంలోనే అత్యుత్తమ జైళ్ల శాఖగా గుర్తింపు పొందిందని అన్నారు.