Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ మాస్ డిమాండ్
- అందర్నీ పర్మినెంట్ చేయాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులం దర్నీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్ ఫోరం) డిమాండ్ చేసింది. వారికి సంబంధించిన ఇతర అన్ని సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిం చాలని కోరింది. తద్వారా సభలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని టీ మాస్ రాష్ట్ర చైర్మెన్ ప్రొఫె సర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, టీ మాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి యాజమా న్యం కార్మిక చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. కోలిండియా అమలు చేస్తున్న వేతనాలను కాంట్రా క్టు కార్మికులకు చెల్లించకుండా శ్రమదోపిడీకి పాల్ప డుతున్నదని తెలిపారు. ఇలాంటి అంశాలను పరిష్క రించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. సింగరే ణిలో అసలు కాంట్రాక్టు కార్మికులే లేరంటూ చెప్పటం శోచనీయ మన్నారు. తద్వారా శాసనసభను, రాష్ట్ర ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించారని విమర్శిం చారు. మరోవైపు సింగరేణిలో పరిధిలోని 11 మంది ఎమ్మె ల్యేలు కూడా కాంట్రాక్టు కార్మికుల గురించి పట్టిం చుకోక పోవటం దారుణమన్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీకి చెందిన వారేనని తెలిపారు. తద్వారా కాంట్రాక్టు కార్మికులందరికీ బోనస్ ను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వేతనాలతోపాటు కార్మిక చట్టా ల న్నింటినీ పకడ్బందీగా అమలయ్యేట్టు చూడాలని విజ్ఞప్తి చేశారు. జాన్వెస్లీ మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలనిచ్చా రని తెలిపా రు. వాటన్నింటినీ విస్మరించ టం సరికాద న్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీమాస్ తరపు న ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం స్టీ రింగ్ కమిటీ నాయకులు రేఖ, ఆర్.శ్రీరాం నాయక్, ధర్మానాయక్ కూడా పాల్గొన్నారు.