Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బలరాంనాయక్కే ఓటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. అందులో ఏడుగురు ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించారని, వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ న్నారు. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలో తనను కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజ్యసభ ఎన్నికల్లో నీచమైన రాజకీయాలు చేశారన్నారు. శాసనసభలో టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యే సంఖ్య బలం ఉంటే ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్ల కోసం మూడో అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాలేయాదయ్య, రెడ్యానాయక్. భాస్కర్ రావు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కోరం కనకయ్య, విఠల్ రెడ్డి, పువ్వాడ అజ రు కుమార్ విప్ను ధిక్కరించి ఓట్లేశారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.