Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ ప్రమాణముల బ్యూరో
హైదరాబాద్: ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని భారత ప్రమాణముల బ్యూరో (బీఐఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘటకేసర్లో.. నకిలీ బీఐఎస్ లైసెన్సు కలిగి ప్యాకెజ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తోన్న శివగంగ మినరల్ వాటర్ ప్లాంట్పై బీఐఎస్ అధికారులు సోదాలు నిర్వహించారు. 'ఫోస్టర్స్' బ్రాండ్ పేరుతో ఆ సంస్థ నిర్వహిస్తోన్న కల్తీ నీటి వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఐఎస్ సూచించింది. మార్కెట్లో లభ్యమయ్యే వాటర్ బాటిల్ల స్టోరేజీ విధానం, అమ్మకాలు, వాటి నాణ్యత విషయంలో అవగాహాన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కల్తీ నీరు తాగి వ్యాదుల బారిన పడొద్దని పేర్కొన్నారు. ఐఎస్ఐ మార్క్ లేక, బీఐఎస్ ప్రమాణాలు పాటించకుండా సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు ప్రజల దృష్టికి వస్తే ఈ కింది నెంబర్ల (27243339, 2249993/9996/9997/9998)కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు.