Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 25న జరిగే సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలని టీఎన్జీఓ హైదరాబాద్ యూనియన్ నాయకులు భరత్భూషణ్, స్వామిగౌడ్, భరత్లు వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగే సభలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీఓ రాష్ట్ర నాయకులు రవీందర్రెడ్డి, రాజేందర్, ముజీబ్, ప్రభాకర్ తదితరులు పెద్దఎత్తున పాల్గొంటా రని అన్నారు. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బదిలీలపై నిషేదం ఎత్తివేయాలని, ఉద్యోగుల విభజన సమస్యలు పరిష్కరించాలని, ఆర్డర్ టు సర్వ్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఖాళీలను భర్తీచేయాలనే డిమాండ్లతో సభ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.