Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలో అసెంబ్లీ ఉద్రిక్తం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చలో అసెంబ్లీ ఆందోళనా కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావుతో సహా కిసాన్మోర్చా నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాల యం నుంచి చలో అసెంబీకి బయల్దేరిన వీరిని పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. ఇటీవల బీజేవైఎమ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ట్రాఫిక్ రాకపోకల్ని నియంత్రించి వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్టులు చేశారు. అదే సమయంలో అసెంబ్లీ వద్ద కూడా భారీగా పోలీసుల్ని మోహరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాలను అడ్డుకోలేరని చెప్పారు. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వడ్డీల భారాన్ని మోపిందని, అది చెల్లిస్తేతప్ప కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకర్లు తేల్చి చెప్తున్నారని అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్బీమా పథకం క్రింద ఒక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని, కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారిమళ్ళించారని ఆరోపించారు.