Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభల సందర్భంగా 'తెలంగాణ రాష్ట్రం- ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా' అనే అంశంపై ఆదివారం హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సెమినా ర్ను నిర్వహించనున్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహిస్తారు. శాసనమండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, నవతెలంగాణ సంపాదకులు ఎస్.వీరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, టీ మాస్ ఫోరం చైర్మెన్ కంచ ఐలయ్య, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ ప్రొఫెసర్ తిరుమలి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కోవా నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజహర్ హుస్సేన్ తదితరులు సెమినార్లో పాల్గొంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక విధానాలు, పట్టణీకరణ, సామాజిక న్యాయం, యువత, మహిళలు తదితరాంశాల సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయ నమూనాను ఈ సందర్భంగా వారు వివరిస్తారు. ఈ సెమినార్లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ (ఎం) ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.