Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురిపై కేసు, ఆరుగురి అరెస్ట్
- ప్రధాన నిందితుడి కోసం గాలింపు
నవతెలంగాణ-ఖానాపూర్ రూరల్
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వరుసగా రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యా యులే ప్రశ్నపత్రాలను వాట్సప్ ద్వారా లీక్ చేస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల లో గురువారం పేపర్ను లీక్ చేసి సమాధానాలు రాసి పంపుతుండగా ఉపాధ్యాయులను పట్టుకుని 10మందిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానా పూర్ మండల కేంద్రంలో సైన్స్ పేపర్-1 వాట్సప్ ద్వారా లీకైంది. ఇందుకు బాధ్యులైన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని అరెెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తు న్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి సీఐ ఆకుల అశోక్ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి రమణ ప్రశాంత్ కుమార్తె స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షాకేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తోంది. ప్రశాంత్ తన మిత్రుడైన లక్ష్మణచాంద జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేసే మన్మథ్రెడ్డిని సాయం కోరాడు. దాంతో అతను వాట్సప్ ద్వారా సైన్స్ పేపర్-1 ప్రశ్నపత్రాన్ని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ను సమీపంలోని ప్రయివేటు పాఠశాలలో పనిచేసే గంగాధర్కు ఫార్వడ్ చేసి అక్కడ జవా బులు తయారు చేయించారు. ఈ సమాచారం అం దుకున్న పోలీసులు దాడి చేయగా ప్రశ్నపత్రంతో పాటు రెండు సెల్ఫోన్లు, రెండు గైడ్స్లు లభిం చాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన మన్మథ్రెడ్డి పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారిలో వ్యాపారి రమణప్రశాంత్తోపాటు ప్రయివేటు పాఠశాల సిబ్బంది గంగాధర్, రవికుమార్, సాయ న్న, శ్రీనివాస్, రాజేందర్ ఉన్నారు. సమావేశంలో ఎస్ఐ వినరుకుమార్, డీఈఓ ప్రణీత, ఎంఈఓ రాంచందర్, ఏఎస్ఐ మోహినొద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యులను వెంటనే సస్పెండ్ చేస్తాం: డీఈఓ టామ్నే ప్రణీత
ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడైన ఉపాధ్యాయు డిని వెంటనే సస్పెండ్ చేస్తాం. ప్రస్తుతం మన్మథ్రెడ్డి సెలవులో ఉన్నాడు. ఆయనకు సహకరించిన వారిని విచారిస్తున్నాం. బాధ్యులను గుర్తించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.