Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని శాసనమండలి చీఫ్విప్ పాతూరి సుధాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఇప్పటి నుంచే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించాలని డిమాం డ్ చేశారు. గురువారం శాసనమండలిలో టీపీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి వేణుగోపాలస్వామి, ఎం.రాధాకృష్ణారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత .జిల్లాల ప్రకారమే బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని కోరారు. ఈ వేసవిలో జరగకుంటే, తర్వాత నిర్వహించడం కష్టమని చెప్పారు. అంతర్ జిల్లా, రాష్ట్ర బదిలీలూ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్పౌజ్ కేసుల సమస్య పరిష్కరించాలన్నారు. జీవోనెంబర్ 9,10ప్రకారం ఎవరి యాజమాన్యం పరిధిలో వారికి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు.
టీపీటీయూగా మారిన టీటీయూ
ఇప్పటి వరకూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(టీటీయూ) పేరుతో కొనసాగుతున్న సంఘాన్ని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ)గా మార్చినట్టు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాలస్వామి, రాధాకృష్ణారావు తెలిపారు. గురు వారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...టీటీయూ పేరుతో మరోక సంఘం కార్యకలా పాలు నిర్వహిస్తుండటంతో సంఘం పేరులో చేసినట్టు చెప్పారు. సమావేశంలో సంఘం గౌరవసలహాదారు జి మోహన్రెడ్డి, నాయకులు వీరభద్రారావు, సారయ్య, గురుప్రసాద్, యాదగిరి, సాయిరెడ్డి, చంద్రశేఖర్, క్రిష్ణ, మధుసుధన్రెడ్డి, పవన్కుమార్ పాల్గొన్నారు.