Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించి, పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుతోపాటు వెబ్సైట్లో ఉంచాలని టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటి చైర్మెన్ మర్రిశశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ వారీగా జరిగే ఓటర్ల జాబితాల తయారీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మే1,3 తేదీల్లో జరిగే జిల్లా, మండలస్థాయి సమావేశాలకు కాంగ్రెస్ ప్రతినిధులు విధిగా హాజరు కావాలని కోరారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశానికి సభ్యులు జి నిరంజన్, ప్రేమలత అగర్వాల్, టి రాజేశ్వర్, టి నరేందర్, పి రాజేష్ హాజరయ్యారు.