Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన టీజీటీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ...నోటిఫికేషన్ ప్రకారం ఓపెన్ కేటగిరిలోని పోస్టులను భర్తీ చేసి, ఆ తర్వాత రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ముందు రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేసి, ఆ తర్వాత ఓపెన్ కేటగిరిలోని పోస్టులను భర్తీ చేశారని ఆరోపించారు. ఆరో జోన్, ఐదో జోన్లో పలు అక్రమాలు జరిగాయని చెప్పారు. అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.