Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ 28న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డి.వి కృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిరియాపై అమెరికా, దాని మిత్ర దేశాలు పాలస్తీనా ప్రజలపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఏప్రిల్ 16న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సిరియా రాజధాని డమాస్కస్పై యుద్ద విమానాలతో దాడి చేశాయని తెలిపారు. ఈ దాడులను ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.