Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ్ పదవిపై అనుమానాలు?
- ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు
- భట్టి కొనసాగింపు...కొత్తగా రేవంత్రెడ్డికి
- బీసీ కోటాలో పొన్నం, దానం పేర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూన్లో కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు జరగనున్నాయి. కర్నాటక ఎన్నికల తర్వాత ఏఐసీసీ అధిష్టానం నాయకత్వప్రక్షాళనకు శ్రీకారం చుట్టను న్నది. గత కొంత కాలంగా గాంధీభవన్లో ఇదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ స్వయంకృతాపరాథంతో ఓడిపోయిం దని విశ్లేషించుకున్నది. ఇకపై అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసేందుకు ఈసారి రాజకీయ వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలని అధిష్టానం భావిస్తున్నది. రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి ఇప్పటికే అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. అందులో భాగంగానే పార్టీని విజయపథంలో నడిపించడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్ష పదవి పదిలంగా ఉంటుందా? కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా? అనే అంశంపై పార్టీలో భిన్నా భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ముంచు కొస్తున్న తరుణంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం లేదని ఆయన వర్గీయులు చెబుతు న్నారు. సీనియర్లను పట్టించుకోకపోవడం, పార్టీని సమన్వయ పరచకపోవడం, ప్రజాసమస్యలపై సరైన ఫోకస్ పెట్టకపోవడంతో ఆయనను తప్పించి కొత్త నేతను ఎంపిక చేస్తారని మరో గ్రూపు చెబుతున్నది. ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి పార్టీలో కీలక పద వుల్లో కొనసాగుతుండటంతో బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల్లోనూ, ఎమ్మెల్యే సీట్లతో జనాభా ప్రాతిపదిక సీట్లు కేటాయించాలని అధిష్టానికి నివేదికలు పంపించారు. అధ్యక్షుడి సంగ తి ఎలా ఉన్నా... వివిధ సామాజికవర్గాలకు చెందిన ముగ్గురు నాయకులకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించే అకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్యని ర్వహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్కను కొనసా గిస్తూనే...బీసీ సామాజిక వర్గానికి మరొకటి ఇవ్వనున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ పదవికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దానం పార్టీకి దూరంగా ఉండటం, టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం, గ్రేటర్ అధ్యక్షు డిగా ఉండి కూడా కార్యక్రమాలు చేపట్టలేదనే ఆయ నపై విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్కు జాతీయ నాయకులు వచ్చిన సందర్బంగా కొంత హడావుడి చేయడం తర్వాత కనుమరుగు కావడం దానం వంతైంది. పార్టీ అధ్యక్షుడు ఆయనకు బస్సుయాత్ర కన్వీనర్ పదవి ఇవ్వడం, 29న ఢిల్లీలో జరగనున్న ఆక్రోశ్ ర్యాలీకి ఇక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలను తరలించడానికి రైల్వే బోగీల బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇదే అదనుగా తీసుకుని దానం ఆ కార్యనిర్వాహక అధ్యక్షపదవి దక్కించు కునేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో సత్సంబంధాలు కలిగిన ఉన్న పొన్నం కూడా ఎంతో భరోసాతో ఉన్నట్టు తెలిసింది. అందుకే ఏ చిన్న అవకాశం చిక్కినా హైకమాండ్ దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇక ఏఐసీసీ సభ్యు లు, కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి మరొక కార్యని ర్వాహక అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరుగు తున్నది. పార్టీలో చేరిన సమయంలో ఆయనకు ప్రచారం కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా జరిగింది. కొంత మంది సీనియర్ నేతలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయనకు ప్రచార కమిటీ కాకుండా వర్కింగ్ ప్రెసిం డెంట్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. 2014 ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్గా వ్యవ హరించిన దామోదర రాజనర్సింహకు ఈసారి అదే బాధ్యత అప్పగిస్తారా? లేక డికె అరుణకు కట్టబెడ తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధ్యక్ష పద వి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గా లు అంటున్నాయి. పార్టీ పగ్గాలు బీసీలకు అప్పగి స్తారనే నేపథ్యంలో మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.