Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మార్చి 31న డిప్యూటీసీఎం కడియం శ్రీహరి సమక్షంలో జరిగిన ఒప్పందాల అమలులో ప్రభుత్వ నిర ్లక్ష్యాన్ని ఉపాధ్యాయ సంఘాల సం యుక్త కార్యాచరణ కమిటీ (జాక్టో) తీవ్రంగా తప్పుబట్టింది. ఇచ్చిన హావీ లను అమలు చేయకుంటే పోరుబాట పడుతామని హెచ్చరించింది. గురు వారం హైదరాబాద్లో జాక్టో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా నాయకులు మా ట్లాడు తూ...సమస్యల పరిష్కారానికి డిప్యూ టీసీఎం హామీనిచ్చి నెలరోజులు కావ స్తున్నా, ఇప్పటికీ కేవలం స్పాట్ వా ల్యుయేషన్ రేట్ల పెంపుదల ఉత్తర్వులు తప్ప, మిగిలిన ఏ ఒక్క అంశం పైనా ఉత్తర్వులు రాలేదని తెలిపారు. కామన్ సర్వీస్ రూల్స్ విషయంలో న్యాయ పరమైన సమస్యలను పరిష్క రించేం దుకు సీనియర్ న్యాయవాదిని నియ మిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని చెప్పారు. పీఈటీ, భాషా పండితుల అ ప్గ్రేడేషన్కు సంబంధించిన పోస్టులు, పాఠశాలల వారిగా కేటాయింపులు జర గలేదని విమర్శించారు. సమావేశంలో జాక్టో నేతలు రఘునందన్, భుజంగరావు, చెన్నయ్య, వేణుగోపాల స్వామి, ఎండీ అబ్దుల్లా, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.