Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 7గంటలకు సచివాలయంలోని డి బ్లాక్లో డిప్యూటీసీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బి సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలు వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. మార్చి 15 నుంచి ఈనెల 2వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,38,867 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఉదయం పదిగంటలకు విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన అధికారులు...కడియం శ్రీహరి టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొననున్న నేపథ్యంలో ఫలితాల విడుదల సమయాన్ని మార్చారు.
ఫలితాలు తెలుసుకునే వెబ్సైట్లు
www.bse.telangana.gov.in
http://results.cgg.gov.in
www.navatelangana.com
www.vidyatoday.in
www.ExamResults.net
www.vidyavision.com
www.manabadi.com
www.schools9.com