Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 192 జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్లమెంటు సభ్యులు, శాసనస భ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయసా ్థనాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు గురువారం న్యాయ వ్యవహారాలు, శాసన వ్యవహారాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి వి.నిరంజ న్రావు జీవో నెంబరు 192ను విడుదల చేశారు. ఈ కోర్టుకు జిల్లా సెషన్స్ కోర్టు హోదా ఉంటుందని ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆయా సందర్భాల్లో నమోదయ్యే కేసులను ఇందులో విచారిస్తారు. ఈమేరకు హైకోర్టు రిజిష్టార్(పరిపాలన) పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం అమోదించింది. ఈకోర్టుకు ప్రత్యేక జడ్జిని నియమిస్తారు. జీవో ప్రకారం రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఈ కోర్టు పరిధిలోకి రానున్నారు.