Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్కు 80వేల బస్తాల ధాన్యం
- ధర తగ్గించిన ఖరీదుదారులు
- మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
- మద్దతు ధరతో కొంటామన్న జేసీ
- హమాలీలకూ కాంటా చార్జీలు పెంపుదల
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట మార్కెట్కు ఒకేసారి 80వేల బస్తాల ధాన్యం రావడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధర తగ్గించేశారు. ఆగ్రహంతో రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే హమాలీలు కూడా తమ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. చివరకు జాయింట్ కలెక్టర్ స్పందించి ధాన్యాన్ని ఎంత రాత్రివరకైనా మద్దతు ధరకు కొంటామని, అటూ హమాలీలకూ కాంటా చార్జీలు పెంచుతామని హామీ ఇచ్చారు.
శుక్రవారం నుంచి వరుసగా మార్కెట్కు మూడు రోజులు సెలవు కావడంతో రైతులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తీసుకొచ్చారు. దాంతో క్వింటా ధాన్యం బుధవారం రూ.1,590 ఉండగా గురు వారం ఖరీదుదారులు కేవలం రూ.1100 నుంచి 1200 రూపాయలకే కోట్ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు తేమను మిషన్తో కాకుండా చేతులతో చూస్తూ ధర తగ్గించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖరీదుదారులు, అధికారులు కుమ్మకై ధర తగ్గించారని రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్ సెక్రటరీ యల్లయ్య, గ్రేడ్ సెక్రటరీ పోశెట్టిని నిర్బంధించారు. వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో మార్కెట్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా 65వ జాతీయ రహదా రిపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. ఈ క్రమంలోనే హమాలీలు కూడా తమ కాంటా చార్జీ పెంచాలని డిమాండ్ చేస్తూ మెరుపు సమ్మెకు దిగారు.
మద్దతుగా నిలిచిన పలు సంఘాలు
రైతులకు సీపీఐ(ఎం), రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రైతులకు మద్దతుగా నిలిచారు. మద్దతు ధర ఇవ్వలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య అధికారులను డిమాండ్ చేశారు. మార్కెట్లో ఖరీదుదారులు, దళారుల మోసాలను అరికట్టాలన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేశారు. ధాన్యంలో తేమ శాతాన్ని మిషన్తో పరీక్షించాలని డిమాండ్ చేశారు. నాయకులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డీఎస్పీ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, సిబ్బంది రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.
చివరకు దిగొచ్చిన అధికారుల
రైతుల ఆందోళన సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడ టంతో చివరకు జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి రాస్తారోకో వద్దకు చేరుకున్నారు. మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తేమ శాతం మిషన్తో పరిశీలించి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఎంత రాత్రయినా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. హమాలీలకు ప్రస్తుతం బస్తాకు రూ.14.20 ఇస్తుం డగా రూ.19.2 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు రూ.17.10 ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాంపతి, ఆర్డీఓ మోహన్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెల్లి సైదులు ఉన్నారు.