Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు పిల్లలు, కిశోరబాలికలు, తల్లులకు అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలను అందించడం కోసం '155209' హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. గురువారం సచివాలయంలో హెల్ప్లైన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా మాతా శిశు సేవలందించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని చెప్పారు. నిరుపేద వర్గాల అవసరాల కోసం 35 వేల అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని వివరి ంచారు. మెరుగైన సేవలు అందించడానికే అంగన్వాడీలకు రూ.15 వేలకు వేతనాలు పెంచామని చెప్పారు. తల్లులు బలపడేలా, వారి పిల్లలు దేశానికి ఉపయోగపడేవిధంగా బాలామృతం పథకం ద్వారా వారికి పాల సరఫరా, గుడ్లు అందించడం తదితర సేవలు అంగన్వాడీల ద్వారా నిర్వహి స్తున్నట్టు వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ మాట్లాడుతూ హెల్ప్లైన్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. జిల్లాల వారీగా సమాచారం తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ ఈ హెల్ప్లైన్ను జివికె-ఈఎంఆర్ఐ సహకారంతో అందుబాటులోకి వచ్చిందన్నారు.