Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ వినోద్ను ప్రశ్నించిన మాజీ ప్రధాని మన్మోహన్
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
'మీ చిరకాల వాంఛ అయిన తెలం గాణకు సాధించుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా సాగు తోంది' అని ఎంపీ వినోద్ కుమార్ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రశ్నించారు.
గురువారం ఢిల్లీలోని ఢిల్లీ విశ్వవి ద్యాలయంలో ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత చెన్న మనేని హన్మంతరావు రాసిన 'మై జర్నీ ఫ్రం మార్క్సిజం, లెనినిజం టు నెహ్రువియన్ సోషలిజం' అనే పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మో హన్సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీ వినో ద్కు మార్ కూడా పాల్గొన్నారు. 'తెలం గాణ మంచిపనితీరు కనబ రు స్తుందని విన్నాను' అని మన్మోహ న్సింగ్ తనతో అన్నారని అనం తరం ఓ ప్రకటనలో వినోద్కుమార్ తెలిపారు. విద్యుత్తు సమస్యలు పరిష్కారించుకోవడంతో పాటు భారీస్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని మాజీ ప్రధానికి వివరించినట్టు ఎంపీ పేర్కొన్నారు.