Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్లు తమిళనాడుకు బియ్యం అమ్ముకోవచ్చు: మంత్రి ఈటల
నవతెలంగాణ - పెద్దపల్లి
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేం దర్ తెలిపారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ చాంబర్లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమిళనాడుకు కిలో రూ.25.31 పైసల చొప్పున అమ్ముకునే వెసు లుబాటును తెలంగాణ ప్రభుత్వం రైస ్మిల్లర్లకు కల్పించిందన్నారు. ఉమ్మడి కరీంనగర్లోని రైస్మిల్లర్లకు ఈ అవకాశం ఉందన్నారు. రైస్మిల్లర్లు రూ.1620-1650 ధర చెల్లిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయటం శుభపరిణామమన్నారు. ఈ క్రమంలో రైతులు కూడా నేరుగా రైస్మిల్లర్లకు విక్రయించుకోవచ్చని తెలపారు. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1425 మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ఐకేపీ, పీఏ సీఎస్, మార్కెట్ యార్డుల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేస్తున్నామన్నారు. గ్రేడ్ -ఏ రకం వరి ధాన్యానికి రూ.1590, సాధారణ రకం ధాన్యానికి రూ.1550 మద్దతు ధర అందిస్తున్నామని తెలిపారు. పౌర సరఫరా శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టామన్నారు. రానున్న కాలంలో అధునాత టెక్నా లజీని ఉపయోగించి అక్రమాలకు తావులేకుండా చేస్తా మన్నారు. కార్య క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘవీర్ సింగ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆంజనేయరావు పాల్గొన్నారు.