Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హస్తకళల ఉత్పత్తులపై పన్ను తగ్గించండి: కేంద్ర జౌళిశాఖ మంత్రి ఇరానీకి మంత్రి కేటీఆర్ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా పునరు ద్ధరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీకి రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. అలాగే హస్తకళలపై వివిధ శ్లాబుల కింద విధించిన జీఎస్టీ పన్నును ఐదు శాతం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 14 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయాలని విన్నవించారు. గురువారం ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో స్మృతిఇరానీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల జౌళిశాఖ మంత్రుల సమావేశం జరిగింది. జౌళిశాఖతో పాటు హస్తకళల రంగానికి చేయూతనిచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ నుంచి కేటీఆర్ హాజరయ్యారు. సమావేశనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 వందల 70 కోట్ల బడ్జెట్ను కేటయించిందని, రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని చేనేత మగ్గాలను జీయో ట్యాంగింగ్ చేశామని వివరించారు. హస్తకళలకు ప్రచారం కల్పించడంతో పాటు ఆన్లైన్ ద్వారా అమ్మకాలకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ అంశాలన్నింటనీ సమావేశంలో వివరించామని, కేంద్రమంత్రి స్మృతీఇరానీ ప్రశంసలు తెలియజేశారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో 14 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. 2014 వరకు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపచేశారని, ఆ తరువాత నిలిపేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఆరోగ్యబీమాను పునరుద్ధరించాలని కోరారు. ఈ సమావేశంలో జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామాయర్, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.