Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
నవ తెలంగాణ : ప్రత్యేక ప్రతినిధి
అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి.. పోలీసు అధికారులను గురువారం ఆదేశించారు. కొంపల్లిలో శుక్రవా రం జరుగుతున్న ప్లీనరీకి రాష్ట్ర ముఖ్య మంత్రితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మొత్తం 12 వేల మంది వరకు ఈ ప్లీనరీలో పాల్గొంటున్న నేప థ్యంలో భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాధ్ సజ్జనార్ను కోరారు. ఇటీవల జరి గిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోవడంతో వారి తరఫున ప్రతీ కార చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం సైతం ముందస్తు హెచ్చ రికలు చేసినట్టు తెలిసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్లీనరీ జరిగే కొంపల్లి ప్రాంతాన్ని మొదలుకుని నక్సల్స్ ప్రభావిత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సైతం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. కాగా ప్లీనరీ ప్రాంగణాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం పరిసరాలపై డేగ కన్నేశాయి. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్వీయ పర్యవేక్షణలో ఇద్దరు డీసీపీలు, నలుగురు అదనపు ఎస్పీలు, 16 మంది డీఎస్పీలు సహా మొత్తం రెండు వేల మంది పోలీసులు భద్రత విధుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.