Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి పొన్నాల విజ్ఞప్తి
- కర్నాటకలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని విమర్శ
- ఎమ్మెల్యేలకు అభినందనలు : కాంగ్రెస్ నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కర్నాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. గెలిపించిన కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపింది. గవర్నర్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి తప్పించాలని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆయన కర్నాటకలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. బలంలేని బీజేపీ నేతతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్లో పార్టీ సీనియర్ నేతలు వి హనుమంతరావు, మర్రి శశిధర్రెడ్డి, సర్వే సత్యనారాయణ, నిరంజన్, పొంగులేటి సుధాకరరెడ్డి, బొల్లు కిషన్లు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నాటకలో ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచిందని, న్యాయం, న్యాయ వ్యవస్థకు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పెకిలించిన మతతత్వ శక్తులకు సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేసిందని వారు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజ్యాంగ వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పొన్నాల ఆరోపించారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రయత్నాలు ఫలించాయి : ఉత్తమ్
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్రెడ్డి అని పేర్కొన్నారు. యడ్యూ రప్ప రాజీనామా చేయ డం కాంగ్రెస్ విజయమ న్నారు. ఎట్టకేలకు ప్రజాస్వామ్యం గెలిచిం దని, ఆ స్ఫూర్తితో 2019 ఎన్నికల్లో తెలం గాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుం దన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తే ఎదురుదెబ్బలు తప్పవు : కనుకుల
దేశంలో ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని పరి హాసం చేస్తే ఎదురు దెబ్బలు తప్పవని కాంగ్రెస్ సేవాదళ్ చైర్మెన్ కనుకుల జనార్ధనరెడ్డి హెచ్చరించారు.
గాంధీభవన్లో సంబురాలు
కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి విశ్వాస పరీక్షలో నెగ్గడంతో గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున్న బాణాసంచా పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు.