Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఆదివారం మావోయిస్టులు మందుపాతరను పేల్చిన ఘటనలో ఏడుగురు జవాన్లు చనిపోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బస్తర్ ఐజీ రతన్లాల్ డాంగి వివరాల ప్రకారం చోల్నార్ నుంచి బచేలి మార్గంలో రోడ్డు పనులు నడుస్తున్నాయి. ఆ పనులకు భద్రత కలిపించేందుకు బలగాలు అక్కడకు వెళ్లాయి. ఇదే అదునుగా భావించిన మావోయిస్టులు ముందుగా ఏర్పాటు చేసుకున్న ఐఈడీ బాంబుతో చోల్నార్ గ్రామంలో పోలీస్ వాహనాన్ని పేల్చారు. బాంబు పవర్పుల్గా పేలడంతో పోలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో రక్కు కెఆర్యు యాదవ్, దృవ్, సాలిగ్రాం, విక్రమ్ యాదవ్, రాజేష్సింగ్, వరింద్రనాథ్ మృతి చెందారు. ఆర్జున్ రాజ్వర్ అనే జవాను గాయపడగా బచేలీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు ఏకే 47, రెండు ఎస్ఎల్ఆర్, రెండు ఇన్సాస్, రెండు గ్రెనైడ్లను మావోయిస్టులు అపహరించుకుపోయారు.