Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కృష్ణానది పునరుజ్జీవనంపై తెలంగాణ జల వనరుల అభివృద్ధి కార్పోరేషన్ మంగళవారం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనుంది. వచ్చే పదేండ్ల కాలాన్ని యునైటెడ్ నేషన్స్ వాటర్ డికేడ్గా ప్రకటించిన నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు టిడబ్లుఆర్డిసి చైర్మన్ వి.ప్రకాశరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు సదస్సును ప్రారంభిస్తారని, మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారని చెప్పారు. ఇరిగేషన్ నిపుణులు, వరల్డ్ వాటర్ కౌన్సిల్కు చెందిన పృధ్వీరాజ్ సింగ్, వాటర్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాజేంద్ర సింగ్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సెక్రటరీ డా.రామేశ్వరరావు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, పలువురు సాగునీటి రంగ నిపుణులు సదస్సులో పాల్గొంటారు. కృష్ణా పరివాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 300కు పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్లు ప్రకాశరావు వెల్లడించారు.