Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వారీ గుంతలో ఇద్దరు, బావుల్లో ఇద్దరు
- చెరువులో మునిగిపోయిన ముగ్గురు నేపాల్ యువతులు
నవతెలంగాణ -సంగారెడ్డి టౌన్/
దుండిగల్ / బుగ్గారం/సుల్తానాబాద్
నీరు తాగేందుకు, ఈత కోసం వెళ్లి, స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఆదివారం వేర్వేరు చోట్ల ఏడుగురు ప్రాణం కోల్పోయారు. వీరిలో బతుకుదెరువు కోసం వచ్చిన నేపాల్కు చెందిన ముగ్గురు యువతులు ఉన్నారు. క్వారీ గుంతలో దిగిన ఇద్దరు బాలురు, బావుల్లో పడి మరో ఇద్దరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నేపాల్కు చెందిన జ్యోతి, లక్ష్మి, అంజలి కుటుంబాలు బతుకుదెరువు కోసం వచ్చి సంగారెడ్డిలో నివాసం ఉంటున్నా యి. పురుషులు గూర్కా పని చేస్తున్నారు. వంట కోసం కట్టెలు తెచ్చేందుకు ముగ్గురు యువతులు, ఇద్దరు చిన్నారుల తో కలిసి ఆదివారం మధ్యాహ్నం కలబ్గూర్కు వెళ్లారు. అక్క డ అందరూ నీరు తాగేందుకు చెరువు వద్దకు పోయారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ముగ్గురు నీటిలో మునిగిపో యారు. చెరువు ఒడ్డుపై ఏడుస్తున్న చిన్నారులను చూసిన గ్రామస్తులు విషయం తెలుసుకుని చెరువులో వెతికారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లక్ష్మి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని సీఐ నరేందర్ తెలిపారు. కాగా, మృతుల్లో అంజలికి ఒక్కదానికే వివాహం అయింది.
క్వారీ గుంటలో: హైదరాబాద్ బాచుపల్లి బాచుపల్లి మం డలం, నిజాంపేట్ గ్రామ పరిధి హిల్ కౌంటీ పక్కన పెద్ద క్వారీ గుంత ఉంది. రాజీవ్ గాంధీనగర్లో నివాసముండే కాకినాడకు చెందిన నాగేశ్వరరావు డ్రైవర్. ఇతని కుమారుడు డేవిడ్రాజు(14) గీతాంజలి పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. నాగర్కర్నూల్కు చెందిన కురుమయ్య ఆటో డ్రైవర్. ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు చంటి(9) రాజీవ్గాంధీనగర్లోని మోడల్ స్కూ ల్లో రెండో తరగతి చదువుతున్నాడు. చంటి, డేవిడ్రాజు, మరికొందరు స్నేహితులు కలిసి ఆదివారం ఉదయం క్వారీ గుంతలోకి ఈతకెళ్లారు. ఈత సరిగా రాక డేవిడ్, చంటి మునిగిపోయారు. మిగతా పిల్లలు ఈవిషయాన్ని తల్లిదండ్రు లకు చెప్పడంతో వారి అక్కడికి చేరుకుని నీటిలో వెతికారు. అప్పటికే చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. ఎస్ఐ శంకర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావుల్లో : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొడిమ్యాల పోశవ్వ అనారోగ్యంతో శనివారం మృతిచెందింది. ఆమె మనుమరాలు నర్మద భర్త రవి(28), కుమారుడితో కలిసి బుగ్గారం వచ్చారు. ఆదివారం ఉదయం అంత్యక్రియల అనంతరం సమీపంలో ఉన్న వ్యవసాయ బావివద్దకు స్నానా నికి వెళ్లారు. బావిలో లోపల ఒడ్డున ఉన్న బండరాయిపై కూర్చుని స్నానం చేస్తుండగా రవి నీటిలో పడిపోయి మృతి చెందాడు. సుమారు గంటపాటు ఇనుప కొక్కెంతో గాలిం చగా రవి మృతదేహం లభ్యమైంది. అతని మామ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కట్ల రవీందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గొల్లపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ఒకరు మృతిచెందారు. కనుకుల్ల గ్రామానికి చెందిన నాసర్(46) జీవనోపాధి కోసం సుల్తానాబాద్లో స్థిరపడ్డాడు. ఈనెల 18న ఇంట్లో నుంచి వెళ్లిన నాసర్ ఆదివారం వ్యవసాయ బావిలో చనిపోయి కనిపించాడు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాకేష్ తెలిపారు.