Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గుంభనం పాటిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు మినహా మిగతా అన్ని పార్టీల ముఖ్యనేతలు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక రాజకీయాలపై స్పందిస్తు న్నారు. బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, గడువు కంటే ముందుగానే ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బలపరీక్షలో నెగ్గేందుకు చివరివరకు బీజేపీ సామభేద దండోపాయాలు ప్రయోగించినా, ఎన్నో అక్రమ పద్ధ తులు పాటించింది. దీనిపై బీజేపీ అనుసరించిన పద్ధతిని తప్పుపడుతూ ఆయా పార్టీల నేతలు ఖండించినా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఈ విషయంలో బహిరంగంగా ప్రకటన విడుదల చేయలేదు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని, అందుకే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన కేసీఆర్ శనివారం నాటి పరిణామాలను స్వాగతించకపోవడంలో పరమార్థమేంటో అర్థం కావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఫెడరల్ఫ్రంట్లో భాగంగా కర్ణాటకకు వెళ్లి దేవెగౌడనూ, కుమారస్వామితోనూ చర్చలు జరిపి, ఎన్నికల్లో జేడీఎస్కు మద్దతు ప్రకటించారు. అవసరమైతే జేడీఎస్కు మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. తాజా పరిణామాలతో ఆయన మద్దతిచ్చిన పార్టీనే కాంగ్రెస్పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నా కేసీఆర్ కుమారస్వామికి అభినందనలు చెప్పకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కుమారస్వామికి కేసీఆర్ అభినందనలు తెలియజేస్తారని టీఆర్ఎస్పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ కుమారస్వామికి అభినందనలు తెలియజేస్తూ, బీజేపీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించడానికి కేసీఆర్ భయపడుతున్నారా? కాంగ్రెస్పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కుమారస్వామికి అభినందనలు చెప్పలేదా? అన్నప్రశ్నలకు టీఆర్ఎస్పార్టీ నేతలు మౌనం పాటిస్తున్నారు. ప్రమాణస్వీకారం రోజు బెంగళూరు వెళ్లడమా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బలపరీక్ష పూర్తయిన తర్వాత అభినందనలు చెప్పడమో ఏదో ఒకటి చేస్తారని తెలుస్తోంది.