Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జమ్మికుంట
ఎంసెట్లో మెరుగైన ర్యాంకు రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శీలం రవీందర్రెడ్డి-శ్రీమతి దంపతుల కుమార్తె సాహితీ హైదరాబాద్లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. శనివారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు లేదని మనస్తాపం చెందింది. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో సాహితీ(19) ఫ్యాన్కు ఉరేసుకుంది. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఇల్లంద కుంట ఎస్ఐ అనుమాండ్ల నరేశ్కుమార్ తెలిపారు.