Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాయలంలో పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు. పాస్ పుస్తకాలు, చెక్కులు సజావుగా అందించేందుకు కలెక్టర్లకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికమించాలని, ఇప్పటికే పంపిణీ చేసిన పాస్ పుస్తకాలు, చెక్కులను సమీక్షించాలని సూచించారు. పాస్ బుక్స్లో పట్టాదారుల పేర్లు తప్పులు రావడం, ఫోటోలు తప్పుగా పడటం, విస్తీర్ణం తక్కువ, ఎక్కువగా నమోదు కావడం లాంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు.