Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుస్నాబాద్/ఆలేరుటౌన్/మోత్కూరు/వేములపల్లి
వడదెబ్బతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య (55) ఇరవై ఏండ్లుగా హుస్నాబాద్లో నివాసముంటూ కట్టెకోత కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం ఎండలోనే కట్టెలు కోసే పనిచేశాడు. సాయంత్రం ఇంటికి రాగానే ఆస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని రంగనాయక వీధిలో పట్టణానికి చెందిన గోకరకొండ వెంకటమ్మ(85) ఎండ వేడిమిని తట్టుకోలేక మృతిచెందింది. అదేజిల్లా మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన బీసు రోశయ్య (80) ఎండ తీవ్రతను తట్టుకోలేక వాంతులు, విరేచనాలకు గురై మతి చెందాడు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన తూముల కాంతమ్మ(48) పొలం పనుల నిమిత్తం వెళ్లగా వడదెబ్బకు గురైంది. చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.