Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 జిల్లాల నుంచి 190 మంది కళాకారులు
- నేడు తమ్మినేని, గద్దర్ రాక
నవతెలంగాణ- జనగామ ప్రతినిధి
జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాలుగు రోజులుగా వివిధ కళారూపాలపై ప్రజానాట్యమండలి శిక్షణా తరగతులు నడుస్తున్నాయి. ఈ శిక్షణా తరగతులకు రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి 190 మంది కళాకారులు హాజరయ్యారు. ముగింపు సందర్భంగా శనివారం రాత్రి బచ్చన్నపేట మండల కేంద్రంలో సభ, కళారూపాల ప్రదర్శన నిర్వహించనున్నారు. దీనికి ప్రజా గాయకులు గద్దర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు. వివిధ అంశాలపై కళా ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వీధి నాటికలతో పాటు కోలాటం, డప్పుల నృత్యాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆటాపాట వంటి వాటిపై శిక్షణ పొందుతున్నారు. శనివారం జరిగే సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బాపురెడ్డి కోరారు.