Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన వై సత్యనారాయణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ రూపొందించిన డిజిటల్ లైబ్రరీని కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వై సత్యనారాయణ ప్రారంభించారు. శుక్రవారం నుంచి డిజిటల్ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులోకి రానుందని చెప్పారు. అనంతరం సివిల్ సర్వీసెస్ విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎస్ఆర్ శంకరన్ అకడామీలో నాన్ ప్రాఫిట్ ప్రొగ్రామ్ ద్వారా సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ 1 విద్యార్థు లకు అవకాశం ఇస్తామన్నారు. దీంతో అన్ని తరగతుల విద్యార్థులకు మేలు చేకూరుతుం దని, వ్యక్తిత్వ వికాసం, విలువలతో కూడిన విద్య అందిస్తుందన్నారు. నామమాత్రపు ఫీజుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎస్ఆర్ఎస్ ట్రస్టు మోమెరియల్ నాణ్యమైన విద్య అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మెన్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి, ప్రిన్సిపల్ కె సురేందర్రెడ్డి, కోర్డినేటర్ సురేష్ అల్లూరి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె సతీష్కుమార్లతోపాటు విద్యార్ధిని, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి సర్టిఫికేషన్స్ అందించారు.