Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు క్రీడా పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి హామీనిచ్చారు. ఈ విషయాన్ని మంత్రి పద్మారావు దృష్టికి తీసుకుపోతానని చెప్పారు. శుక్రవారం ఎల్బీస్టేడియంలోని ఒలంపిక్ భవన్లో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సమావేశం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం క్రీడాకోటా రావడానికి కృషి చేసిన వెంకటేశ్వర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం అల్లీపురం మాట్లాడుతూ...ప్రతి పాఠశాలలో ఒక పీఈటీ ఉండేలా చూస్తానని అన్నారు. త్వరలోనే సీనియర్ కోచ్లు, పీఈటీలు, క్రీడా నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి, మంచి క్రీడాపాలసీని రూపొందిస్తామని చెప్పారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్, సాట్స్ను అనుసంధానం చేయాల్సి ఉందని తెలిపారు. సమగ్ర శిక్షా పథకంలో భాగంగా ప్రైమరీ స్కూల్స్కు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.పదివేలు, ఉన్నత పాఠశాలలకు రూ.25వేల విలువైన క్రీడాసామాగ్రిని అందించనున్నారనీ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో బాలరాజు, భాస్కర్రెడ్డి, జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.