Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ ఆన్లైన్లో శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ ఎస్బి ద్వారకానాథ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 62, ఏపీలో తొమ్మిది కేంద్రాల్లో జరిగిన లాసెట్కు 18,547 మంది హాజరయ్యారని తెలిపారు. లాసెట్కు 23,109 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ నుంచి 21,782 మంది దరఖాస్తు చేయగా, 17,713 మంది పరీక్ష రాశారని తెలిపారు. ఏపీ నుంచి 1,327 మంది దరఖాస్తు చేయగా, 834 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.