Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తు చేసేందుకు నేడే ఆఖరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు దరఖాస్తు చేసేందుకు గడువు శనివారంతో ముగియనుంది. శక్రవారం నాటికి 1,07,450మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నా రని దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 71,413 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని పేర్కొన్నారు. దోస్త్ ప్రవేశాల ప్రక్రియపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. అపరాధ రుసుం రూ.400లతో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని పేర్కొన్నారు.
దోస్త్ గడువు నెలాఖరుకు పెంచాలి
దోస్త్కు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును అపరాధ రుసుం లేకుండా ఈనెలాఖరు వరకు పెంచాలని డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి విజరుభాస్కర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.