Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల అక్రమ బదిలీల కు వ్యతిరేకంగా శనివారం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ (డీఎస్ఈ), జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) కార్యాలయా లను ముట్టడిస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయు క్త కార్యాచరణ సమితి (జాక్టో) సంయు క్తంగా ప్రకటించాయి. ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని ప్రకటించినా అడ్డదారిలో కొందరికి అనుకూలమైన స్థానాలను నేరుగా కట్టబెడుతున్న వైఖరిని తప్పుపడుతున్నాయి. డబ్బు, రాజకీయ పలుకుబడితో పట్టణ ప్రాంతాల్లోని ఖాళీలన్నీ బదిలీలకు ముందే భర్తీ చేయడం సమంజసం కాదని ప్రకటించాయి. అక్రమ పద్ధతిలో బదిలీలు చేశాక సాధారణ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ వల్ల ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం చేసిన పైరవీ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఉమ్మడి తెలంగాణ 10 జిల్లాను, 10 జోన్లుగా ఏర్పాటు చేసినట్టయితే ఎలాంటి సమస్యలు తలెత్తబోవని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి. సరోత్తమ్రెడ్డి, జి. చెన్న కేశవరెడ్డి తెలిపారు.