Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కవితకు మీడియా అండ్ అడ్వర్టైజింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ వినతి
హైదరాబాద్: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోని మార్కెటింగ్, ఆడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్లను ఆదుకోవాలని కోరుతూ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ వారు గురువారం నిజామాబాద్ ఎంపీ కవితను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సొసైటీ సభ్యుల్లో శ్రీనివాస్ గుప్తా, ఎస్ ఎన్రావు, సుబ్బారెడ్డి, శంకర్ దీక్షితులు, రవీందర్, రామచంద్రలు ఉన్నారు. తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసినట్టుగా వారు తెలిపారు. చాలీచాలని జీతాలు, తీవ్రమైన ఒత్తిడుల మధ్య పనిచేసే తమను ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం గుర్తించలేదని, తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు. అలాగే మీడియా అండ్ అడ్వర్టైజింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం కోసం ఒక భవన సముదాయం కేటాయించాలని, అక్రిడేషన్, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై కవిత కూడా సానుకూలంగా స్పందించారని సొసైటీ మెంబర్స్ తెలిపారు.