Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏపీఆర్పీఏ నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పించనర్లు, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టీఏపీఆర్పీఏ) ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లోని జనరల్ పోస్టాఫీస్ (జీపీవో) ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ డాక్ సేవకులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఏపీఆర్పీఏ ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్నాయర్, ఉప ప్రధాన కార్యదర్శి ఎన్ సోమయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కోరారు. కమలేష్ చంద్ర నివేదికను అమలు చేసేందుకు వెంటనే ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమ్మె ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడం, నిమ్మకు నీరెత్తడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా డాక్ సేవకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో తపాలా సూపరింటెండెంట్ కార్యాలయాలు, హెడ్ పోస్టాఫీసుల ముందు ఈనెల 28న ఉదయం 10 గంటలకు ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు.