Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీని వీడిన గజ్వేల్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ టీడీపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ రైతు సంఘం నేత ఒంటేరు ప్రతాప్రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్రావు అల్లుడు మదన మోహన్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్తో పాటు మొత్తం 60 మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి తదిరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లోకి చేరాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రలోభపెట్టారని, అయితే నిజాయితీగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్లోకి చేరినట్టు ఒంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు. తనకు పదవులు, డబ్బు ముఖ్యం కాదని చెప్పారు. 2019 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచి ఆ స్థానాన్ని కాంగ్రెస్కు బహుమతిగా ఇస్తానన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. కనీసం సమస్యలు కూడా చెప్పుకోలేని స్థితి దాపురించిందని తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి కీలకమైన నేతలు చేరడంతో పార్టీ బలోపేతం అవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే దిశగా పార్టీ పయనిస్తోందని అన్నారు. కాగా కేసీఆర్కు పరిపాలన అనుభవం లేదని షబ్బీర్ అలీ విమర్శించారు. ఏడాది నుంచి సచివాలయం రాని వ్యక్తి ఏం పాలన చేస్తాడని ప్రశ్నించారు.
పలు జిల్లాలకు, పట్టణాలకు నూతన అధ్యక్షుల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్గెహ్లాట్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాల నూతన అధ్యక్షులు వీరే
నిజామాబాద్ - తాహిర్ బిన్ హుందన్, కరీంనగర్ - కటకం మృత్యుజయం, ఆదిలాబాద్ - మహేశ్వర్రెడ్డి, మెదక్ - సునితా లక్ష్మా రెడ్డి, రంగారెడ్ది - క్యామ మల్లేష్, మహబూబ్నగర్ - ఓబేదుల్లా కొత్వాల్, నల్గొండ - బూడిద బిక్షమయ్య గౌడ్, వరంగల్ - నాయిని రాజేందర్రెడ్డి, నిజామాబాద్ సిటీ - కేశ వేణు, కరీంనగర్ సిటీ - కర్రా రాజశేఖర్, వరంగల్ సిటీ- కేదరి శ్రీనివాసరావు, రామగుండం -లింగస్వామి యాదవ్, హైదరాబాద్సిటీ -అంజన్కుమార్ యాదవ్.