Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర తాగునీటి శాఖ ఉప కార్యదర్శి రాజశేఖర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఏడాదిలో సుమారు రూ. 471 కోట్ల విలువైన పనులను రాష్ట్రానికి మంజూరు చేస్తున్నట్టు కేంద్ర తాగునీటి, పారిశుద్ద్య శాఖ ఉపసలహాదారులు రాజశేఖర్ తెలిపారు. ఇందులో 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పేద, ధనిక తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి శుద్ధిచేసిన మంచినీటిని అందించాలన్న ప్రభుత్వ సంకల్పం అభినందనీయం చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పథకాల మంజూరు కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న తాగునీటి సనఫరా పథకాలకు సంబంధించి గతేడాది పురోగతిని కమిటీ సమీక్షించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ఆవాసాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన గ్రామాలు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మంచినీటి సరఫరా కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఆయా ఆవాసాల్లో ఇంటింటికి నల్లాతో నీళ్లు అందించేందుకు చేస్తున్న ఇంట్రా విలేజ్ పనుల కోసం ఉపయోగిస్తారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజేం టేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్ విలేజ్, మల్టీవిలేజ్ తాగునీటి పథకాలను మిషన్ భగీరథతో అనుసం ధానం చేసినట్టు చెప్పారు. దట్టమైన అడవులు, కొండల్లో ఉన్న చిన్న చిన్న తండాలకు సోలార్పవర్ను ఉపయోగిం చుకుని తాగునీటిని అందిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఐటీ వినియోగం, అభివద్ధి విషయంలో దేశంలోని పలు ప్రభుత్వ శాఖలకు మిషన్ భగీరథ ఆదర్శంగా రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ వైబ్ సైట్, మొబైల్ యాప్ ను ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లే రూపొందించ డాన్ని ప్రశంసించారు. ఐటీ అభివద్ధి, వినియోగంలో భగీరథ అధికారులకు స్కాచ్ అవార్డు వచ్చినందుకు అభినంద నలు తెలిపారు. తాగునీటి స్వచ్ఛత విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించడంలో ఆర్డబ్ల్యూఎస్ ప్రయోగశా లలు విజయం సాధించాయని ప్రశంసిం చారు. జాతీయ ప్రమాణాలకు అనుగు ణంగా ఇవి ఉన్నాయన్నారు. కేంద్ర భూగర్భ జల వనరుల బోర్డ్ డైరెక్టర్ పి. సుబ్బారావు ఉపరితల నీటి వనరులతో తాగునీటిని సరాఫరా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మిగతా రాష్ట్రాలకు ఆదర్శమన్నారు.
మిషన్ భగీరథ కు ఏమైనా సాంకేతిక సహాయం కావాలంటే చేయ డానికి తమ విభాగం సిద్దంగా ఉందన్నారు. ఈ సమా వేశంలో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ధన్సింగ్, చీఫ్ ఇంజి నీర్లు రాములు నాయక్, కృపాకర్రెడ్డి, జగన్మో హన్రెడ్డి, విజరుపాల్రెడ్డి, కేంద్ర భూగర్భజల వన రుల బోర్డ్ డైరెక్టర్ పి. సుబ్బారావు, ఆరోగ్యశాఖ జా యింట్ డైరెక్టర్ మోతీలాల్, సాగునీటిశాఖ డీసీఈ నరహరి బాబు, సెంట్రల్ వాటర్ కమీషన్ ఎస్.ఈ రఘురామ్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ శంకర్రావు, కన్సల్టెంట్లు నర్సింగరావు, టెక్నికల్ డైరెక్టర్ వెంకట సుబ్బారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.