Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి కాలరీస్ విస్తరించిన 6 జిల్లాలు, 11 ఏరియాల్లో మొత్తం 1.26 లక్షల మందితో ఒకేసారి సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 2016లో 60వేల మందితో సామూహిక యోగా నిర్వహించిన సింగరేణి ఈ ఏడాది ఆ రికార్డును తిరగరాసింది. యోగాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు, ప్రాచుర్యం కల్పించేందుకు ఈ ఈవెంట్ను నిర్వహించినట్టు ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సామూహిక యోగాలో పాల్గొన్నవారికి ఆయన అభినందనలు తెలిపారు.